SARASWATHI: సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం

తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించిన మంత్రి శ్రీధర్ బాబు... కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేశారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగనున్నాయి.
పుష్కర స్నానం ఎక్కడ చేయవచ్చు?
సరస్వతి నది పుట్టిన ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని మానా గ్రామం. ఇది భారత్, టిబెట్ సరిహద్దులో ఉంది. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలోనూ సరస్వతి నది పుష్కర స్నానాలు చేస్తారు. రాజస్థాన్లోనూ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించిందని చరిత్ర చెబుతోంది. తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం ఉందంటారు. అందుకే ఈ ఏడాది సరస్వతి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
పుష్కరాలకు సీఎం రేవంత్రెడ్డి
సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరస్వతీ ఘాట్ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com