Satyavathi Rathode: ఈడీలు, బోడీలు, మోడీలు ఎవ్వరూ ఏం చేయలేరు: మంత్రి సత్యవతి

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. తెలంగాణ గడ్డపై పుట్టినవారు కేసులకు భయపడరన్నారు. తెలంగాణలో పట్టపగలు బీజేపీ దొంగ స్వాములు పట్టుబడితే ఎలాంటి కేసులు లేవన్నారు. బీజేపీ బండి సంజయ్ తీసుకున్న గుంతలో తానే పడతారని హెచ్చరించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 100 స్థానాల్లో కనీసం డిపాజిట్లు దక్కలేదన్నారు. ఈడీలు, బోడీలు మోడీలు ఎందరీనీ తెచ్చుకున్న 2023లో కూడా 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. మహిళా లోకం తిరగబడితే బండి సంజయ్ బతుకు అదోగతిపాలైతుందన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని నీకు తల్లి, భార్య పిల్లలున్నారని ఘాటుగా స్పందించారు సత్యవతి. బిడ్డా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సమాజం సహించదన్నారు. బీజేపీ రాజకీయ ఔన్నిత్యం చాటుకోవాలంటే సంజయ్ లాంటి మూర్ఖులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేశారన్నారు. కేసీఆర్ బీజేపీ మెడలు వంచే రోజులు దెగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com