SC: బీసీ రిజర్వేషన్లపై నేడే సుప్రీంకోర్టులో విచారణ

SC: బీసీ రిజర్వేషన్లపై నేడే సుప్రీంకోర్టులో విచారణ
X
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల అంశం రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో సం­చ­ల­నం­గా మా­రిం­ది. బీ­సీ­ల­కు రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ తె­లం­గాణ ప్ర­భు­త్వం ఇచ్చిన జీ­వో­ను సవా­ల్ చే­స్తూ­తా­జా­గా సు­ప్రీం­కో­ర్టు­లో పి­టి­ష­న్ దా­ఖ­లు కా­వ­డం­తో ఏం జర­గ­బో­తు­న్న­ద­నే ఉత్కంఠ నె­ల­కొం­ది. ఈ పి­టి­ష­న్ నేడు సు­ప్రీం­కో­ర్టు­లో వి­చా­ర­ణ­కు రా­బో­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో ఆది­వా­రం ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­తో మం­త్రు­లు భేటీ అయ్యా­రు. డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క, పీ­సీ­సీ చీఫ్ మహే­శ్ కు­మా­ర్ గౌడ్, మం­త్రు­లు పొ­న్నం ప్ర­భా­క­ర్ సమా­వే­శ­మై బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై సు­ప్రీం­కో­ర్టు­లో పి­టి­ష­న్ పై చర్చిం­చా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై ఎలా ముం­దు­కు వె­ళ్లా­ల­నే వి­ష­యం­పై సమా­లో­చ­న­లు చే­శా­రు. సీ­ఎం­తో భేటీ తర్వాత ఏఐ­సీ­సీ వ్య­వ­హా­రాల ఇన్ చా­ర్జి మీ­నా­క్షి నట­రా­జ­న్‍తో భట్టి వి­క్ర­మా­ర్క, మహే­శ్ కు­మా­ర్ గౌడ్, మం­త్రు­లు పొ­న్నం ప్ర­భా­క­ర్, వా­కి­టి శ్రీ­హ­రి భేటీ అయ్యా­రు. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు, తాజా పరి­స్థి­తు­ల­ను మీ­నా­క్షి­కి వి­వ­రిం­చా­రు.

తెలంగాణ హైకోర్టులోనూ విచారణ

బీసీ రిజర్వేషన్లను చాలెంజ్ చేస్తూ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ విచారణలో ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ విషయంలో లీగల్‍గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆసక్తి నెలకొంది. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది? వాటిని ఎలా అధిగమించాలి, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఎలాంటి వాదనలు వినిపించాలి అనే విషయాలను అంశాలను ఇవాళ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. ఒక వేళ రిజర్వేషన్ల అమలుకు కోర్టు నుంచి అనుమతి లభించకపోతే పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉన్న నేపథ్యంలో నేడు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Tags

Next Story