TG: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూప్లుగా ప్రభుత్వం విభజించింది. మొదటి గ్రూప్లో ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్, రెండో గ్రూప్లో ఉన్నవారికి 9 శాతం, మూడో గ్రూప్లో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన దామోదర్ రాజ నర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
శాసనసభలో ఇలా..
మార్చి 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్చి 18న అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత మార్చి 19న శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్ భవన్కు చేరి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో చట్టంగా ఆమోదం పొందింది.
ఏకసభ్య కమిషన్
తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభిజించి గవర్నమెంట్ కు లేఖ అందజేసింది. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతం కాగా, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74 శాతంగా ఉంది. వీరికి వారికి 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963 శాతం కాగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఈ రోజు నుంచి ఇధి చట్టంగా అమల్లోకి రాబోతున్నట్టు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com