Secunderabad : జిమ్ చేస్తూ కానిస్టేబుల్ మృతి

By - Vijayanand |24 Feb 2023 6:21 AM GMT
బోయిన్ పల్లిలో నివాసం ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. సికింద్రాబాదులోని ఓ జిమ్ లో వ్యాయమం చేస్తుండగా గుండె నొప్పిరావడంతో విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు
జిమ్ చేస్తూ యువకులు మృతి చెందుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లో విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోయాడు. ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న విశాల్ 2020 బ్యాచ్ లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. బోయిన్ పల్లిలో నివాసం ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో సికింద్రాబాదులోని ఓ జిమ్ లో వ్యాయమం చేస్తుండగా గుండె నొప్పిరావడంతో విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com