Secundrabad : ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూత

Secundrabad : ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూత
1951 మార్చి 5న జన్మించిన సాయన్న.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ సాయన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. 1951 మార్చి 5న జన్మించిన సాయన్న.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు సాయన్న.. ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2009 వరకు టీడీపీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం నిర్వర్తించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు.. 2015లో టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమితులయ్యారు.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న.. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి గెలుపొందారు.

Tags

Read MoreRead Less
Next Story