కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన : కేసీఆర్
By - TV5 Digital Team |18 Dec 2021 12:17 PM GMT
CM KCR : కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు.
CM KCR : కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనతో పాటు క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ పాలన....కొత్త జోనల్ వ్యవస్థతోనే సాధ్యమన్నారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు కేసీఆర్. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుaగుతారని..ఉత్పాదకత పెరుగుతుందని సీఎం అన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు కేసీఆర్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com