కోవిడ్ వేళ పేదలకు వరంగా మారిన సేవాభారతి..!

కోవిడ్ వేళ పేదలకు వరంగా మారిన సేవాభారతి..!
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది.

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్‌లైన్ ద్వారా సలహాలందిస్తారు. ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.

Tags

Read MoreRead Less
Next Story