Siddipet: వెంకన్న సేవలో హరీష్ రావు.. రూ.కోటి కిరీటం బహుకరణ
By - Himabindu |2 Jan 2023 9:30 AM GMT
స్వామి వారి సేవలో మంత్రి హరీష్ రావు; వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. కోటి రూపాయల కిరీటాన్ని బహుకరించిన మంత్రి
సిద్దిపేట జిల్లా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని బహూకరించారు. కోటి రూపాయలకు పైగా విలువైన కిరీటాన్ని ఆలయ నిర్వాహకులు కొనుగోలు చేసిన కిలో బంగారంతో తయారు చేయగా.. మిగిలినది హరీశ్రావు సహా దాతలు అందించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ పీఠాధిపతికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని అందజేశారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారు ఝాము నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయా ప్రాగణం కిక్కిరిసిపోయింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com