
తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలుప్రాంతాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెం, మంచిర్యాల జిల్లా హాజిపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.5 డిగ్రీలు రికార్డైనట్టు..... హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబాబాద్, నారాయణపేట్, జయశంకర్, వరంగల్, ములుగు, జనగామ వనపర్తి, గద్వాల్, నాగర్కర్నూల్, హనుమకొండ, కొత్తగూడెం, నిర్మల్, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజ్గిరి,నిజామాబాద్ జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. కుమరంభీం...., సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 45, హైదరాబాద్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com