శ్రావణి కేసు : నిర్మాత అశోక్రెడ్డి అరెస్ట్

టీవీ ఆర్టిస్ట్ శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డిని.. ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్, సాయికృష్ణా రెడ్డిలను ఇది వరకే పోలీసులు అరెస్టు చేశారు. A3గా ఉన్న అశోక్ రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్ నగర్ స్టేషన్కు వస్తానని చెప్పి... చివరి నిమిషంలో అశోక్ రెడ్డి ఎస్కేప్ అయ్యాడు. సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్టు... పోలీసుల విచారణలో తేలింది. ఆమె దేవరాజ్కు దగ్గర కావటాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న అమీర్పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్తో గొడవ తర్వాత.. సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్రెడ్డి అందరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్రెడ్డి కీలకంగా మారినట్టు... పోలీసులు గుర్తించి ఆధారాలు సేకరించారు. ఇప్పుడు అశోక్ రెడ్డి అరెస్టుతో.. కేసుతో నిందితులుగా ఉన్న అందరూ అరెస్టైనట్టైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com