Secunderabad: మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఇక్కడే ఉంటాం: యువకులు
By - Divya Reddy |17 Jun 2022 12:00 PM GMT
Secunderabad: తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉంటామని యువకులు స్పష్టం చేశారు.
Secunderabad: తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉంటామని యువకులు స్పష్టం చేశారు. లాఠీఛార్జ్ చేసినా భరిస్తాం.. ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. మీరు మా మనిషిని చంపితే తప్పులేదు గానీ.. మేం మీ ఆస్తులను ధ్వంసం చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ఆందోళన చేసి వెళ్లేవాళ్లమని.. ఫైరింగ్ ఎందుకు చేశారంటూ పోలీసుల్ని నిలదీశారు యువకులు. అయితే.. సామరస్యంగా పరిష్కరించడానికే తాము వచ్చామని పోలీసులు తెలిపారు. చట్టాన్ని ధిక్కరించొద్దని సూచించారు. ఒక్కరోజులో సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com