Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు

X
By - TV5 Digital Team |2 Feb 2022 12:09 PM IST
Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొల్లిజియం.
Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొల్లిజియం. ఇందులో ఏడుగురు న్యాయవాదులు కాగా... ఐదుగురు న్యాయాధికారులు. ఏడుగురు న్యాయవాదులైన కాసోజు సురేందర్, చాడ విజయభాస్కర్రెడ్డి, సురేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సపియుల్లాబేగ్, ఎన్. నడ్చరాజ్ శ్రావణ్కుమార్ వెంకట్ పేర్లను సిఫార్సు చేసింది. ఇక జ్యూడిషియల్ అధికారులుగా ఉన్న అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావునాయుడు, ఏ. సంతోష్రెడ్డి, డాక్టర్ డి. నాగర్జున్లను న్యాయమూర్తులుగా ప్రతిపాదించింది సుప్రీంకోర్టు కొల్లిజియం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com