Suryapet: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైన బస్సు

X
By - Subba Reddy |29 March 2023 11:15 AM IST
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంద్ర బస్సు సూర్యాపేట చేరుకోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
సుర్యాపేట జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సుర్యాపేటలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంద్ర బస్సు సూర్యాపేట చేరుకోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కేకలు వేస్తూ దిగి పరుగులు తీశారు. క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అందరూ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com