Suryapeta: డబుల్‌ బెడ్‌రూమ్ కోసం ఆందోళన

Suryapeta: డబుల్‌ బెడ్‌రూమ్ కోసం ఆందోళన

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్ కోసం నిరుపేదలు ఆందోళన చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోకి అధికారులు, సిబ్బంది వెళ్లకుండా ముళ్లకంప అడ్డుగా వేసి ధర్నాకు దిగారు. ప్రభుత్వం, స్థానిక అధికారులపై బాధితులు తీవ్రంగా మండిపడ్డారు. కొందరు అధికారులు.. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అయినవారికి ఇళ్లు ఇచ్చుకుంటూపోతే తామే కావాలని ప్రశ్నించారు. డ్రాను నిలిపివేసి మళ్లీ సర్వే చేసి నిజమైన లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు అందించాలని బాధితులు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story