REVANTH: నేడు జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్లో కల్వకుర్తికి బయలుదేరి వెళతారు. సాయంత్రం ఐదున్నర వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కొట్ర సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్రెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం కల్వకుర్తిలోని ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. వెల్దండ మండలం, కొట్ర గేటు వద్ద హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. అంతకుముందు బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు దాదాపు 25 వేల మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. కాగా, ఆదివారం ఉదయం హైదరాబాద్, నెక్లెస్ రోడ్లోని జైపాల్రెడ్డి స్మారక స్థలిలో ఆయనకు నివాళిని అర్పించనున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సొంత గడ్డ కల్వకుర్తికి ఆదివారం రానున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు పలు ఆశలు పెట్టుకున్నారు. కేఎల్ఐ డీ-82 కాల్వతో పాటు సబ్ కెనాల్స్ పూర్తి, పెండింగ్ భూ నష్ట పరిహారం మంజూరుతో పాటు వంద పడకల ఆస్పత్రి మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com