Telangana: నూతన సచివాలయం ఓపెనింగ్ అప్పుడే..

X
By - Subba Reddy |24 Jan 2023 3:15 PM IST
ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న ఉత్తరాది నేతలు, అంబేద్కర్ మనవడు
ఎంతో హట్టహాసంగా ఆధునిక పద్ధతులతో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17నాడు ప్రారంభించనున్నారు. ఉదయం పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరుకానున్నారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com