Telangana: ఆలేరు ఇళ్ల పంపిణీలో రసాభస

X
By - Subba Reddy |31 Jan 2023 5:00 PM IST
ఎమ్మెల్యే గొంగిడి సునీతను అడ్డుకున్న గ్రామస్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. కొలనుపాక గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలపై ప్రజలు భగ్గుమంటున్నారు. అర్హులైన వారికి కాకుండా బీఆర్ఎస్కు చెందిన వారినే ఎంపిక చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే గొంగిడి సునీతను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి రానివ్వకుండా అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. టెంట్లు కూల్చి కుర్చీలు విరగ్గొట్టారు. ఆలేరు-చేర్యాల రహదారిపై కిరోసిన్ డబ్బాలతో బైఠాయించి ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్నవారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసకుంది. ఈ క్రమంలో అక్కడ ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com