Telangana: జీహెచ్‌ఎంసీ అధికారులపై మంత్రి సబిత ఫైర్‌

Telangana: జీహెచ్‌ఎంసీ అధికారులపై మంత్రి సబిత ఫైర్‌
శిలాఫలకాన్ని దిమ్మెకు కాకుండా కరెంట్ స్తంభానికి కట్టిన అధికారులు

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దిమ్మెకు కాకుండా కరెంట్ స్తంభానికి అది కూడా వైర్లతో కట్టడంపై మంత్రి ఫైర్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్వాకంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో శిలాఫలకం ప్రారంభించకుండానే మంత్రి వెనుదిరిగారు. ఇక మంత్రి సబిత వెళ్లగానే అధికారులు ఆ శిలాఫలకాన్ని తొలగించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌ నగర్‌లో ఈ సంఘటన జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story