Telangana: ప్రభుత్వ భూములను కేటీఆర్ కొల్లగొడుతుండు

X
By - Subba Reddy |10 Feb 2023 3:30 PM IST
ఇటుక బట్టి కార్మికుల సమస్యలను తెలుసుకున్న రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లాలో రేవంత్రెడ్డి 'హాత్ సే హాత్ జోడో' యాత్ర కొనసాగుతుంది. బండిపహాడ్ గ్రామంలోని ఇటుక బట్టి కార్మికులను కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు రేవంత్.వారు నివసిస్తున్న గుడిసెలోకి వెళ్లి కాసేపు వారితో ముచ్చటించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీరుస్తామన్నారు. గడీల పాలనకు కాంగ్రెస్ వ్యతిరేకమని,ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను మంత్రి కేటీఆర్ కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com