Telangana: రాజాసింగ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
హైదరాబాద్ గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. శనివారం రోజు గోశామహల్తోపాటు కోఠి, అబిడ్స్, సీబీఎస్తోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు కనబడ్డాయి. అయితే బీఆర్ఎస్ శ్రేణులే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
రెండ్రోజుల క్రితం రాజాసింగ్ విసిరిన వెయ్యి కోట్ల సవాల్కు బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ ప్రతి సవాల్ విసిరారు. వెయ్యి కోట్లు పంచినా ఈ సారి రాజాసింగ్కు గోశామహల్ ప్రజలు ఓట్లు వెయ్యరని జోస్యం చెప్పారు. తొమ్మిది ఏళ్లలో గోశామహల్లో రాజాసింగ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తారంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో గోశామహల్ ప్రజలు రాజాసింగ్ను ఇంటికి పంపిస్తారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com