Telangana: మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదు

X
By - Subba Reddy |11 Feb 2023 1:00 PM IST
ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ సంస్థకే కట్టబెట్టింది
మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్రేమిలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ సంస్థకే కట్టబెట్టిందని వివరించారు. అడ్డగోలుగా ధరలు పెంచితే ఊరుకోబోమని హెచ్చరించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి విమర్శించారు. ఓ శత్రుదేశంగా చూస్తుందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రోలకు భారీగా నిధులు కేటాయించి, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com