Telangana: నాగర్ కర్నూల్లో సామూహిక వివాహాలు
By - Subba Reddy |11 Feb 2023 11:15 AM GMT
మహా వేదికపై ఒకటి కానున్న 220 జంటలు
ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం మరోసారి వేదికైంది. ట్రస్ట్ అధినేత, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి, జమునారాణి దంపతుల ఆధ్వర్యంలో వివాహాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రేపు(ఆదివారం) జెడ్పీ గ్రౌండ్లో సామూహిక వివాహాలు జరగనున్నాయి. ఈ మహా వేదికపై 220 పేద జంటలు ఏకం కానున్నాయి. ఇందులో భాగంగా ఎదుర్కోళ్లు నిర్వహిస్తున్నారు. పంజాబీ నృత్యాలు, దాండియా, మెహిందీ, పసుపు కొట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com