Telangana: అశ్వరావుపేటలో రేవంత్ హాత్ సే హాత్

X
By - Subba Reddy |13 Feb 2023 4:45 PM IST
ప్రభుత్వంలోకి వచ్చాక వృద్ధులను, ఆశ్రమాలను అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా
ఖమ్మం జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాదయాత్ర జోరుగా సాగుతోంది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఏడోరోజు అశ్వరావుపేటలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను రేవంత్ అప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల అవసరాల కోసం తన సొంత ఖర్చులతో ఆశ్రమంలో బోర్ వెల్ వేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చాక వృద్ధులను, ఆశ్రమాలను అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వృద్ధాశ్రమంలో రేవంత్రెడ్డి పేరుతో కాంగ్రెస్ శ్రేణులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com