Telangana : కోమటిరెడ్డిపై సీనియర్ నేతలు ఫైర్

Telangana : కోమటిరెడ్డిపై సీనియర్ నేతలు ఫైర్
కేడర్‌ మనోధైర్యాన్ని తగ్గించేలా మాట్లాడటం సరికాదు; వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని విన్నపం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై స్వంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కేడర్‌ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని సీనియర్‌ నేత మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌. ఆయన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని,కేడర్‌ మనోధైర్యాన్ని తగ్గించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. పార్టీ హైకమాండ్‌ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. గతంలోనే ఆయనపై హైకమాండ్‌ యాక్షన్ తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు.

వెంటకరెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ వర్కింగ్‌ మహేష్‌గౌడ్‌ కూడా తప్పు పట్టారు. ఆయన ప్రతిసారి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని, పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతమేనన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని అన్నారు .

Tags

Read MoreRead Less
Next Story