Telangana: కారు ఆటో ఢీ.. ఇద్దరు మృతి
By - Subba Reddy |15 Feb 2023 7:30 AM GMT
చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి హరీష్రావు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చనిపోగా, ఆటోలో వెళ్తున్న పలువురు స్కూల్ విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి హరీష్రావు పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com