Telangana: పోలీసు జాగిలాలకు పాసింగ్ ఔట్ పరేడ్

X
By - Subba Reddy |16 Feb 2023 12:45 PM IST
మోయినాబాద్ ఇంటిగ్రేట్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ
హైదరాబాద్లో పోలీసు జాగిలాలకు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. మోయినాబాద్ ఇంటిగ్రేట్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు. 22వ బ్యాచ్లో 48 జాగిలాలకు శిక్షణ పూర్తి అయ్యింది. శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల విచారణలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు 64 హ్యాండ్లర్స్కు సైతం శిక్షణ పూర్తి అయ్యింది. 12జాతుల జాగిలాలను నేర పరిశోధనలకు వినియోగిస్తున్నారు. జాగిలాలకు 8 ఏళ్లకు ఉద్యోగ విరమణ ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com