Telangana: పేల్చేవాళ్లు, కూల్చేవాళ్లు కాదు నిర్మించే వాళ్లు కావాలి

Telangana: పేల్చేవాళ్లు, కూల్చేవాళ్లు కాదు నిర్మించే వాళ్లు కావాలి
యాదగిరిగుట్టలో వంద పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన

వైద్యరంగం మీద సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు మంత్రి హరీష్‌ రావు. యాదగిరిగుట్టలో వంద పడకల హాస్పిటల్‌కు హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు. త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ పెడ్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో 20 ఏండ్లకు ఒక మెడికల్ కాలేజీ వస్తే కేసీఆర్ పాలనలో ఒక్క ఏడాదే 8 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. లక్ష జనాభాకు మెడికల్ సీట్ల పరంగా చూస్తే తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. ఆలేరు హాస్పిటల్‌ అభివృద్ధి కోసం కోటి రూపాయలు విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు పేల్చేవాళ్లు, కూల్చేవాళ్లు కాదు నిర్మించే వాళ్లు కావాలన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధి కోరుకోవాలి కానీ విధ్వంసం కాదన్నారు హరీష్ రావు.

Tags

Read MoreRead Less
Next Story