Telangana: పేల్చేవాళ్లు, కూల్చేవాళ్లు కాదు నిర్మించే వాళ్లు కావాలి
By - Subba Reddy |16 Feb 2023 10:30 AM GMT
యాదగిరిగుట్టలో వంద పడకల హాస్పిటల్కు శంకుస్థాపన
వైద్యరంగం మీద సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు మంత్రి హరీష్ రావు. యాదగిరిగుట్టలో వంద పడకల హాస్పిటల్కు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ పెడ్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో 20 ఏండ్లకు ఒక మెడికల్ కాలేజీ వస్తే కేసీఆర్ పాలనలో ఒక్క ఏడాదే 8 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. లక్ష జనాభాకు మెడికల్ సీట్ల పరంగా చూస్తే తెలంగాణ టాప్లో ఉందన్నారు. ఆలేరు హాస్పిటల్ అభివృద్ధి కోసం కోటి రూపాయలు విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు పేల్చేవాళ్లు, కూల్చేవాళ్లు కాదు నిర్మించే వాళ్లు కావాలన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధి కోరుకోవాలి కానీ విధ్వంసం కాదన్నారు హరీష్ రావు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com