Telangana : కేంద్ర మంత్రి సీతారామన్ కు హరీష్ కౌంటర్
By - Vijayanand |17 Feb 2023 12:07 PM GMT
గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శ
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. కేంద్రం తెలంగాణకు గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ పూర్తి వాస్తవాలతో మాట్లాడారన్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక్కొ కేంద్రమంత్రి ఒక్కొలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒకరు ప్రతిపాదనలే రాలేదంటే..మరొకరు ఖమ్మం, కరీంనగర్కు ప్రతిపాదనలందాయని చెప్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టికల్ 293కి లోబడే అప్పులు తీసుకుందన్నారు హరీష్ రావు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు హరీష్ రావు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com