Telangana: జోరుగా రేవంత్‌ హాత్‌ సే హాత్‌

Telangana: జోరుగా రేవంత్‌ హాత్‌ సే హాత్‌
యూత్‌ కాంగ్రెస్‌ నేతపై దాడికి నిరసనగా ఆందోళన, కలెక్టరేట్‌ ముట్టడి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. 13వ రోజుకు చేరిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఇవాళ వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్ర ఫర్‌ చేంజ్‌ పేరుతో రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రేవంత్‌ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్థానికులు పలు సమస్యలను రేవంత్‌ దృష్టికి తెచ్చారు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే.. అందరి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు వరంగల్‌ కలెక్టరేట్‌ ముట్టడించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. యూత్‌ కాంగ్రెస్‌ నేతపై దాడికి నిరసనగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ పైన హత్యాయత్నం కేసు పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

పాదయాత్రలో భాగంగా రేవంత్‌.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆయనకు ఊరువాడ ఘన స్వాగతం పలుకుతుంది. అడుగడుగునా కాంగ్రెస్‌ శ్రేణులు గ్రాండ్‌ వెల్కమ్‌ చెబుతున్నారు. రేవంత్‌ పాదయాత్రతో కేడర్‌లో జోష్‌ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story