Telangana: రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదనేవారు కళ్ల డాక్టర్కు చూపించుకోవాలి
By - Subba Reddy |26 Feb 2023 10:45 AM GMT
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతుంది
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఇక తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదనే వారు కళ్ల డాక్టర్కు చూపించుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపన చేసిన ఎంపీ.. ఎన్నికల ముందు ప్రజల్లోకి వచ్చే వారి మాటలు నమ్మోద్దన్నారు. ఇక కొంత మంది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని.. అలాంటి వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com