Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్‌

Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్‌
భూపాలపల్లి టౌన్‌లో ఉద్రిక్తత వాతావరణం

భూపాలపల్లి టౌన్‌లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది. రేవంత్‌ రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది అయితే కాంగ్రెస్‌ కేడర్‌ను అడ్డుకున్నారు బీఆర్‌ఎస్‌ శ్రేణులు.బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలకు అడ్డంగా కడుతున్నారంటూ ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. అయితే వారం రోజులు అయినా బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించలేదని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను అడ్డుకొని చెదరగొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story