Telangana: బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

Telangana: బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన
గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచి మోదీ సర్కార్‌ వంటింట్లో మంట పెడుతోందని మండిపాటు

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు.. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచి మోదీ సర్కార్‌ వంటింట్లో మంట పెడుతోందని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు గానీ.. ధరలు మాత్రం పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.. ధరలు పెంచుతూ బీజేపీ, సబ్సిడీ ఇవ్వకుండా బీఆర్‌ఎస్.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు మండిపడ్డారు.

Tags

Next Story