Telangana: అవి భావోద్వేగంతో చేసిన వాఖ్యలే: కోమటిరెడ్డి

Telangana: అవి భావోద్వేగంతో చేసిన వాఖ్యలే: కోమటిరెడ్డి
తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని ప్రశ్నించిన వెంకట్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన ఆడియోపై ఆయన స్పందించారు. ఎప్పుడు తన రాజకీయ ప్రత్యర్ధులను దూషించలేదని.. అవి భావోద్వేగంతో చేసిన వాఖ్యలు మాత్రమేనన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదన్నారు. శత్రువుల్ని కూడా దగ్గర తీసే తత్వం తనదన్నారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చామన్నారు. 3 సార్లు పట్టుబట్టి బీసీలకు దక్కేలా చూశానన్నారు. పార్టీలో చేరినప్పిటి నుంచి చెరకు సుధాకర్ తనని తిడుతున్నాడని, ఎందుకు తిడుతున్నారని అడిగానన్నారు. గతంలో ఆయనపై పీడీయాక్ట్ పెడితే.. తానే కొట్లాడినట్లు గుర్తు చేశారు. తిట్టొద్దని మాత్రమే ఆయన కొడుక్కి చెప్పానని అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story