Telangana: మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: మంత్రి జగదీష్‌

Telangana: మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: మంత్రి జగదీష్‌
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాజకీయ దురుద్దేశంతో కవితపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ ఆత్మస్థైర్యంను దెబ్బతీసేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు, అణిచివేతలు కేసీఆర్‌ను ఏమీ చేయలేవన్నారు. నియంతల ఆగడాలు ఎక్కువ కాలం ఉండవని... రాబోయే రోజుల్లో బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేస్తామన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి.

Tags

Next Story