Telangana: మహిళలను అణగదొక్కుతున్నారు: డీకే అరుణ

Telangana: మహిళలను అణగదొక్కుతున్నారు: డీకే అరుణ
మోదీని చూసి కేసీఆర్‌ బుద్ది తెచ్చుకోవాలి

రాష్ట్రంలో మహిళలను అణగదొక్కుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. మెడికో ప్రీతి ఘటనలో సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదన్నారు. బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ నవ్య మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మోడీ పాలన ఉందని డీకే అరుణ తెలిపారు. మోదీని చూసి కేసీఆర్‌ బుద్ది తెచ్చుకోవాలని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ అంటే కవిత ఒక్కరే కాదన్నారు. ఏం చేసిన కేసీఆర్‌ కాపాడుతారనే ధీమాతో రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story