Telangana: ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలు: టీపీసీసీ ఛీఫ్ రేవంత్
By - Subba Reddy |10 March 2023 12:15 PM GMT
అవినీతి ఆరోపణలతో రాజయ్యను బర్త్రఫ్ చేసిన కేసీఆర్ కవితపై అన్ని ఆరోపనలు వచ్చిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ పట్ల వ్యవహరించినట్లు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పట్ల ఎందుకు వ్యవహరిస్తలేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలతో రాజయ్యను బర్త్రఫ్ చేసిన కేసీఆర్ కవితపై అన్ని ఆరోపనలు వచ్చిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోదీ, కేద్ర మంత్రులు చెప్పారు అయిన అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని రేవంత్ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com