Telangana: కొత్త సెక్రటేరియట్కు ముహూర్తం ఫిక్స్

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 30వ తేది, మేఘ లగ్నం ఉదయం 6.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సీట్లో కూర్చోనున్నారు. ఆ తరువాత తమ తమ స్థానాల్లో మంత్రులు, అధికారులు కూర్చోనున్నారు. కొత్త సెక్రటేరియట్ త్రీడీ యానిమేషన్ వీడియోను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. అయితే కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఐదేళ్లపాటు సచివాలయానికి రాకుండా పాలన చేసిన ఏకైక సీఎం కేసీఆర్ రికార్డుకెక్కారు. అయితే సచివాలయ నిర్మాణానికి ఐదేళ్లు పట్టింది. ఈ ఐదేళ్ల పాటు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచే పాలన కొనసాగిస్తున్నారు. అయితే కొత్త సెక్రటేరియట్కైనా సీఎం క్రమంగా వస్తాడా రాడా అనే అంశం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com