Telangana: నేడు చంచల్గూడ జైలుకు బండి
By - Subba Reddy |16 March 2023 7:00 AM GMT
రాజకీయ రంగు పులుముకుంటున్న టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. గురువారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చంచల్గూడ జైలుకు వెళ్లనున్నారు. అక్కడ బీజేవైఎం నేతల్ని పరామర్శించనున్నారు. లక్షల మంది నిరుద్యోగులకు సంబంధిచిన అంశం కావడంతో బీజేపీ అలెర్ట్ అయింది.బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ విషయంపట్ల తొమ్మిది మందితో కూడిన ప్రత్యేక కమిటీని బండి నియమించారు. వాస్తవ విషయాలను అధ్యయనం చేయనున్న టాస్క్ఫోర్స్ కమిటీ. ఈ కమిటీ కన్వీనర్గా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ను నియమించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com