Telangana: రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు

Telangana: రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు
రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ శాఖల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు

తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ శోభకృత్‌ నామ ఉగాది పండుగ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ శాఖల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలో పంచాంగ పఠనం, వేదపండితులు, అర్చకులు, ఆద్యాత్మికవేత్తలకు సత్కారాలు తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు కవి సమ్మేళనం ఉండబోతోంది. ఈ సందర్భంగా నలుగురు ఆధ్యాత్మికవేత్తలు, ఐదుగురు నాదస్వర విద్వాంసులు, ఇరువై మంది అర్చకులు, ఆరుగురు వేద పారాయణ పండితులను ఉగాది పురష్కారాలతో సత్కరించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story