Telangana: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Telangana: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కేయు జాక్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి హాస్టల్‌లోకి చొరబడి అరెస్టు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోతన, వివేకానంద హాస్టల్ నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. కేయు జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ సహా 12మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి నేతలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తప్పుడు కేసులు పెట్టి విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story