Telangana: భైంసాలో దొంగనోట్ల కలకలం

X
By - Subba Reddy |11 April 2023 11:00 AM IST
నిర్మల్ జిల్లా భైంసాలో దొంగనోట్ల కలకలం రేపుతున్నాయి. మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి ఐదు వందల రూపాయలు
నిర్మల్ జిల్లా భైంసాలో దొంగనోట్ల కలకలం రేపుతున్నాయి. మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి ఐదు వందల రూపాయలు తెచ్చి.. కూరగాయలు కొన్నాడు. అది గమనించని కూరగాయల వ్యాపారి మిగతా చిల్లరు ఇచ్చి పంపాడు. కాసేపటి తర్వాత మళ్లీ ఇంకో ఐదు వందల రూపాయల నోటుతో రాగా సదరు వ్యాపారికి అనుమానం వచ్చి నోటును గమనించడంతో అది నకిలీదని తేలింది. దీంతో దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వ్యాపారి ఫిర్యాదుతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వారాంతపు సంతలో ఎన్ని ఫేక్ నోట్లు చలామణి అవుతున్నాయోనని ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com