Telangana: 10వ తరగతి పేపర్ లీక్..వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు

X
By - Subba Reddy |3 April 2023 5:15 PM IST
తెలంగాణలో సంచలనం రేపుతున్న పేపర్ లీకేజీ ఘటనలు
తెలంగాణలో పేపర్ లీకేజీ ఘటనలు సంచలనం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన కాసేపటికే పేపర్ వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్లో చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల 37 నిమిషాలకు తెలుగు పేపర్ లీకైందన్న ఆరోపణలు వచ్చాయి. అది వాట్సాప్లో తిరగడంతో అధికారులు, పోలీసులు ఖంగుతిన్నారు. అధికారులు విచారణ చేపట్టారు. ప్రశ్నాపత్రం కలకలం రేపడంతో పదో తరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com