Telangana: ఆర్టీసీ బస్సు బోల్తా 15 మందికి గాయాలు

Telangana: ఆర్టీసీ బస్సు బోల్తా 15 మందికి గాయాలు
వనపర్తి జిల్లా కొత్తకోట వద్దకు రాగానే ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.కొత్తకోట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి-44 పక్కన బోల్తాపడింది.యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.

వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story