Telangana: సచివాలయం ప్రారంభం వాయిదా

By - Subba Reddy |11 Feb 2023 6:00 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాయిదా వేసిన ప్రభుత్వం
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న కొత్త సచివాలయం ప్రారంభం కావాల్సి ఉండగా... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాయిదా వేసింది ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మరో తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇక సచివాలయ నిర్మాణ పనులు 90శాతం పైగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాంగణం బయట మెయిన్ గేట్ వద్ద పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com