Telangana: శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి ఆత్మహత్య

Telangana: శ్రీ చైతన్య  కళాశాల విద్యార్థి ఆత్మహత్య
రంగరెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి

రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 10.30 సమయంలో క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసున్నాడు. కాలేజ్‌లో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే విద్యార్థి సూసైడ్ వ్యవహారంలో కాలేజి యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినా కాలేజ్‌ సిబ్బంది పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తామే రోడ్డుపై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి సాత్విక్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ మృతి చెందాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహం తరలించారు. సాత్విక్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరోవైపు కాలేజి యాజమాన్యం తీరును నిరసిస్తూ నార్సింగి లో సాత్విక్ తల్లిదండ్రులు, విద్యా ర్థులు ఆందోళనకు దిగారు. సాత్విక్ ఆత్మహత్యపై యాజమాన్యం కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని నార్శింగి రోడ్డు పై బైఠాయించి విద్యార్థి సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

Tags

Read MoreRead Less
Next Story