Telangana: నేను కాంగ్రెస్‌ మ్యాన్‌ను.. సొంత గూటికి చేరిన డీఎస్

Telangana: నేను కాంగ్రెస్‌ మ్యాన్‌ను.. సొంత గూటికి చేరిన డీఎస్
సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ సొంత గూటికి చేరారు. ఆదివారం ఉదయం వీల్‌ చైర్‌ మీద తన పెద్ద కుమారుడితో గాంధీ భవన్‌కు వెళ్లాడు

నిజామాబాద్‌ సీనియర్‌ నేత డీ. శ్రీనివాస్‌ సొంత గూటికి చేరారు. ఆదివారం ఉదయం వీల్‌ చైర్‌ మీద తన పెద్ద కుమారుడితో గాంధీ భవన్‌కు వెళ్లాడు. ఆయనకు తన కుమారుడు సంజయ్‌కు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావ్‌ ఠాక్రే టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ సొంతొంటికి వచ్చినంత ఆనందంగా ఉందని వెల్లడించారు. ఆయనను ఎవరూ చేర్చుకోవాల్సిన పనిలేదన్నారు. తనకు తానే పార్టీలో చేరుతానని, ఆయన కాంగ్రెస్‌ మ్యాన్‌ని అని డీ. శ్రీనివాస్‌ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story