నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరేసుకుంటా : బండి సంజయ్

X
తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సీఎం కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పించన్ల నిధుల లెక్కలపై కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే... దుబ్బాకా చౌరస్తాలో ఉరివేసుకుంటానంటూ ప్రతిసవాల్ చేశారు. దుబ్బాకలో కేసీఆర్కు గెలవాలని లేదన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే... హరీష్రావు అడ్డుతొలగిపోతుందని, తెల్లారే కేటీఆర్ను సీఎం చేస్తారన్నారు. అందుకే దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవాలని కేసీఆర్కు లేదన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిస్తే... కేటీఆర్ సీఎం కారన్నారు బండి సంజయ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
