TG: కొత్త రేషన్‌ కార్డుల జారీకి సబ్‌ కమిటీ

TG: కొత్త రేషన్‌ కార్డుల జారీకి సబ్‌ కమిటీ
X
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం... ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలు

తెలంగాణ మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్‌ సబ్‌ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్‌ , దామోదర రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా.. జాబ్‌ క్యాలెండర్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీహాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌.. ధరణి పోర్టల్‌ను భూమాత పోర్టల్‌గా మార్చడంతో పాటు పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇండియా స్కిల్స్ వర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


కొత్త రేషన్‌ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘‘గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలని అంశాలను తప్పక నెరవేరుస్తాం. క్రీడాకారులు ఈషాసింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పున హైదరాబాద్‌లో ఇంటి స్థలం, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. విధుల్లో చనిపోయిన రాజీవ్‌ రతన్‌ కుమారుడికి మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించాం. కోదండరాంరెడ్డి, అమీర్‌ ఖాన్‌ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపిస్తాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌ జంట జలాశయాలకు తరలిస్తాం’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.

Tags

Next Story