నేడు కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్

X
By - Subba Reddy |25 May 2023 8:00 AM IST
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన పనులు, వాటి పురోగతి గురించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ సచివాలయంలో సీఎం కేసీఆర్.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన పనులు, వాటి పురోగతి గురించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 9వ విడత హరితహారం, పోడు భూముల పట్టాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించనున్నారు. ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు టెలీ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు.. 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com